రేష్మీ వెండితెరపై ముందుగా అడుగుపెట్టి సరైన సక్సెస్ అందుకోలేక ఆపై బుల్లితెరపై సీరియల్స్ చేసింది. మంచి టర్నింగ్ పాయింట్ కోసం ఎదురు చూస్తున్న సమయంలోనే జబర్దస్ట్ ప్రోగ్రాం లో యాంకరింగ్ రష్మి ముంగిట వాలింది. ఆ ప్రొగ్రామ్ తో చాలా పాపులర్ అయ్యింది. మళ్లీ సినిమాల్లో వేషాలు దక్కించుకొనే ప్రయత్నం చేస్తుంది. తాజాగా గుంటూర్ టాకీస్ సినిమాలో రష్మీ ముఖ్య పాత్రను పోషిస్తున్నది. కాగా ఈ రోజు రష్మి ఓ ఇంగ్లీష్ దిన పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో సినీ పరిశ్రమ గురించి, తను మోసపోయిన విధానం గురించి సంచలన వ్యాఖ్యలు చేసింది. విశాఖపట్నం కు చెందిన ఈ హాట్ హాట్ యాంకర్ చెప్పిన ఆశక్తిదాయక విషయాల వివరాలు మీకోసం...
తనకు చిన్నతనం నుంచి సినిమాల్లో నటించాలని కోరిక ఉందని అందువల్ల తను చిన్నతనంలోనే సినిమా రంగం అంటే ఏమిటో తెలియకుండా.. అవగాహన లేకుండా హైదరాబాద్ వచ్చానని తెలిపింది. ఇక్కడికి వచ్చాక తాను చాలా కష్టపడ్డానని అంతేకాక సినిమాల్లో అవకాశాలకోసం కొంత మంది చేతిలో మోసపోయానని కామెంట్ చేసింది. చాలా మంది దర్శకులు తాము తీస్తున్న సినిమాల్లో మంచి పాత్రలిస్తామని చెప్పి చివరకు సినిమా విడుదలయ్యే సమయానికి ఆ సినిమాలో తను ఎక్కడ ఉన్నదో వెతుక్కొనేలా చేసేవారని ఆవేదనగా చెప్పింది రేష్మీ. - See more
తనకు చిన్నతనం నుంచి సినిమాల్లో నటించాలని కోరిక ఉందని అందువల్ల తను చిన్నతనంలోనే సినిమా రంగం అంటే ఏమిటో తెలియకుండా.. అవగాహన లేకుండా హైదరాబాద్ వచ్చానని తెలిపింది. ఇక్కడికి వచ్చాక తాను చాలా కష్టపడ్డానని అంతేకాక సినిమాల్లో అవకాశాలకోసం కొంత మంది చేతిలో మోసపోయానని కామెంట్ చేసింది. చాలా మంది దర్శకులు తాము తీస్తున్న సినిమాల్లో మంచి పాత్రలిస్తామని చెప్పి చివరకు సినిమా విడుదలయ్యే సమయానికి ఆ సినిమాలో తను ఎక్కడ ఉన్నదో వెతుక్కొనేలా చేసేవారని ఆవేదనగా చెప్పింది రేష్మీ. - See more
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి